Homeఅత్యంత ప్రజాదరణసీఎంగా జగన్ అనర్హుడు పిటీషన్ పై సుప్రీం సంచలన నిర్ణయం

సీఎంగా జగన్ అనర్హుడు పిటీషన్ పై సుప్రీం సంచలన నిర్ణయం

ఓ సుప్రీం కోర్టు న్యాయమూర్తి, కొందరు హైకోర్టు న్యాయమూర్తులపై ఫిర్యాదు చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలో సుప్రీం చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఓ న్యాయమూర్తికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి లేఖ రాయడం.. దాన్ని బహిరంగ పర్చడం రాజ్యాంగ విరుద్ధమని.. సీఎం జగన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని.. అనర్హుడిగా చేయాలని కొందరు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Also Read: హైకోర్టులో మరో పిటిషన్.. ఆ మంత్రులకు ‘రంగు’ పడుద్దా?

సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం సీఎం జగన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పిటీషన్లను కొట్టివేసింది. వీటిపై విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ పిటిషన్లను విచారించడానికి నిరాకరించింది. పిటిషన్లకు ఎటువంటి అర్హత లేదని ధర్మాసనం అభిప్రాయపడింది, ఎందుకంటే విచారణకు ఆదేశించాలా వద్దా అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విచక్షణపై ఆధారపడి ఉందని పేర్కొంది.

“మరొక బెంచ్ ఇప్పటికే ఈ వివాదంపై కొన్ని సమస్యలను విచారించింది. ఏపీ హైకోర్టు మీడియాకు వ్యతిరేకంగా గాగ్ ఆర్డర్ ను ఎత్తివేసే మధ్యంతర ఉత్తర్వులను కూడా రద్దు చేసింది.అలాంటప్పుడు సీఎం జగన్ ను తొలగించాలన్న ఈ పిటిషన్లను ఎందుకు విచారించాలి. ఆ బెంచ్ ప్రతిదీ పరిశీలించనివ్వండి” అని జస్టిస్ కౌల్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Also Read: రాజకీయాల్లో సూపర్ స్టార్ కంటే పవర్ స్టార్ నయమా?

ఓ సుప్రీం కోర్టు జడ్జిపై సీఎం జగన్ రాసిన లేఖ బహిర్గతం కావడంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టు బెంచ్ ను పిటీషనర్లు కోరారు. ఈ లేఖ ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళ్లినందున ఎటువంటి విచారణ అవసరం లేదని అన్నారు. “మీరు ఒక వార్తాపత్రికలో ఏదైనా చదివి, అన్ని రకాల ఊహాగానాలతో పిటిషన్ దాఖలు చేసినప్పుడే ఈ సమస్య” అని ధర్మాసనం అభిప్రాయపడింది.

అమరావతి భూ కుంభకోణం విషయంలో జగన్‌ ముందుకెళ్లకుండా చూడాలన్న మరో పిటిషన్‌లో కూడా కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ఇప్పటికే గ్యాగ్ ఉత్తర్వును ఎత్తివేసినప్పుడు పిటిషన్ ఉద్దేశ్యాన్ని తెలుసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.. సిట్టింగ్ న్యాయమూర్తిపై జగన్ ఎటువంటి వ్యాఖ్య చేయకుండా అడ్డుకోవాలన్న పిటిషన్ మాత్రం జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఇప్పటికే పెండింగ్‌లో ఉందని సుప్రీంకోర్టు వివరించింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version