Homeఅత్యంత ప్రజాదరణరైతు చట్టాలను చదవండి.. దేశ ప్రజలకు లేఖ షేర్ చేసిన మోడీ

రైతు చట్టాలను చదవండి.. దేశ ప్రజలకు లేఖ షేర్ చేసిన మోడీ

PM Modi

కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని రైతుల ఆందోళనతో హోరెత్తుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా , యూపీ రైతులు చేస్తున్న నిరసనలు నేటితో 24 రోజులు పూర్తయ్యియి. రహదారులనే ఆవాసాలుగా మార్చి రైతులు చేస్తున్న ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది.

Also Read: చంద్రబాబు, జగన్.. ఓ అధికారి బలి!

రైతులతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పలు మార్లు చర్చలు జరిపినా వారు వెనక్కి తగ్గడం లేదు. దీంతో ప్లాన్ బిని కేంద్రం అమలు చేస్తోంది. కొత్త చట్టాలు పూర్తిగా రద్దు చేస్తేనే తాము విరమిస్తామని రైతులు అంటుండగా.. రైతులకే ఆ చట్టాలు మేలు చేస్తాయని తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రైతులకు ఓ లేఖ రాశారు. అన్ని భాషల్లో విడుదలైన లేఖను మోడీ తన ట్విట్టర్ షేర్ చేసి ఇది దేశ ప్రజలంతా చదవాలని.. అందరికీ షేర్ చేయాలని కోరారు. రైతులకు మేలు చేసే తమ చట్టాలను అపార్థం చేసుకోకుండా సహకరించాలని మోడీ ఈ సందర్భంగా దేశ ప్రజలను కోరారు.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యవసాయ చట్టాలపై రాసిన లేఖ నమో యాప్ లో కూడా ఉందని.. దీన్ని అందరూ షేర్ చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రజలను కోరారు. బీజేపీ శ్రేణులు మద్దతు దారులు ఇప్పుడు ఈ లేఖను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ హోరెత్తిస్తున్నారు. రైతులకు మేలు చేసే కొత్త వ్యవసాయ చట్టాలని ఎలుగెత్తి చాటుతున్నారు.

Also Read: గన్నవరం వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

మోడీ సర్కార్ రైతుల ఆందోళనకు విరుగుడు ఆలోచించింది. ఆ చట్టాలు మంచివని చాటడానికి రెడీ అయ్యింది. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం వ్యాపించకుండా మోడీ సర్కార్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. తాజాగా నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం విడుదల చేసిన బులిటెన్ ను అందరూ చదవాలని ప్రధాని మోడీ దేశ ప్రజలను కోరారు. కేంద్రం రూపొందించిన ఈ-బుక్ లెట్ లో వ్యవసాయ చట్టాల గురించి విస్తృత సమాచారం ఉందని.. ఆ చట్టాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతాయో గ్రాఫిక్స్ రూపంలో తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు.కొత్త చట్టాల అమలు అనంతరం ఒప్పంద వ్యవసాయం వల్ల లాభపడ్డ రైతుల విజయాలను వివరించారు.

  • మోడీ షేర్ చేసిన లేఖ కింద క్లిక్ చేయగలరు

FarmerLetters_Telugu

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1681849

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version