దృశ్యం-2 రిమేక్ కు వెంకటేశ్ రెడీ

మలయాళ ‘దృశ్యం’ మూవీ అన్ని భాషల్లోనూ రిమేక్ అయ్యి ఘనవిజయం సొంతం చేసుకుంది. దానికి కొనసాగింపుగా ఇటీవలే మోహన్ లాల్-మీనా జంటగా.. అదే పాత్రధారులతో మలయాళంలో ‘దృశ్యం-2’ మూవీ తెరకెక్కింది. అదే సస్పెన్స్ తో మూవీ మరోసారి హిట్ కొట్టింది. దీంతో తెలుగులో దృశ్యం1 రిమేక్ చేసిన వెంకటేశ్, సురేష్ బాబు ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులోనూ మళ్లీ రిమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. తెలుగులో ఈ సినిమాలో వెంకటేశ్ సరసన మీనానే నటించింది. ఇప్పుడు దృశ్యం2లోనూ మీనానే నటిస్తోంది. […]

Written By: NARESH, Updated On : February 20, 2021 7:42 pm
Follow us on

మలయాళ ‘దృశ్యం’ మూవీ అన్ని భాషల్లోనూ రిమేక్ అయ్యి ఘనవిజయం సొంతం చేసుకుంది. దానికి కొనసాగింపుగా ఇటీవలే మోహన్ లాల్-మీనా జంటగా.. అదే పాత్రధారులతో మలయాళంలో ‘దృశ్యం-2’ మూవీ తెరకెక్కింది. అదే సస్పెన్స్ తో మూవీ మరోసారి హిట్ కొట్టింది.

దీంతో తెలుగులో దృశ్యం1 రిమేక్ చేసిన వెంకటేశ్, సురేష్ బాబు ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులోనూ మళ్లీ రిమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. తెలుగులో ఈ సినిమాలో వెంకటేశ్ సరసన మీనానే నటించింది. ఇప్పుడు దృశ్యం2లోనూ మీనానే నటిస్తోంది.

ఇక మలయాళ మాతృక సినిమాను తీసిన జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కేవలం 60 రోజుల్లో అంటే రెండు నెలల నాన్ స్టాప్ షెడ్యూల్ లో దీన్ని పూర్తి చేయడానికి డిసైడ్ అయ్యారు. అదే నటులు, సాంకేతిక నిపుణులతో జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెలుగులోనూ తీస్తున్నాడు.

మోహన్ లాల్ హీరోగా అమేజాన్ ఓటీటీలో రిలీజ్ అయిన దృశ్యం2 హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తెలుగులోనూ రిమేక్ అవుతున్నట్టు ప్రకటించారు. సురేష్ బాబు తోపాటు మలయాళ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.