5 రాష్ట్రాల ఎన్నికలకు మోగనున్న నగారా

దేశంలో మరో ఎన్నికల నగారా మోగనుంది. ఐదురాష్ట్రాల ఎన్నికలకు కేంద్రం సిద్ధమైంది. కేరళ, పశ్చిమ బెంగాల్ సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఈ సాయంత్రం 4.30గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. Also Read: ఉదార‌మే భార‌త‌ విధానం.. ఉదాహ‌ర‌ణ‌లెన్నో! తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి ఎన్నికల తేదీలను ఈరోజు ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశముంది. పశ్చిమ బెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో తృణమూల్ […]

Written By: NARESH, Updated On : February 26, 2021 1:24 pm
Follow us on

దేశంలో మరో ఎన్నికల నగారా మోగనుంది. ఐదురాష్ట్రాల ఎన్నికలకు కేంద్రం సిద్ధమైంది. కేరళ, పశ్చిమ బెంగాల్ సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఈ సాయంత్రం 4.30గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది.

Also Read: ఉదార‌మే భార‌త‌ విధానం.. ఉదాహ‌ర‌ణ‌లెన్నో!

తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి ఎన్నికల తేదీలను ఈరోజు ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశముంది.

పశ్చిమ బెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచి మమతా బెనర్జీ సీఎం అయ్యారు. ఈసారి బీజేపీ పుంజుకొని మమతను ఓడించాలని పట్టుదలగా ఉంది.

ఇక కేరళలో 140 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో వామపక్షాల ఫ్రంట్.. కాంగ్రెస్ పై గెలిచింది. ఈసారి కాంగ్రెస్ గెలవాలని పట్టుదలగా ఉంది. ఇక్కడ బీజేపీ ప్రభావమే లేదు.

Also Read: విశాఖ స్టీల్ పోరాటానికి ‘అమ‌రావ‌తి’ మ‌ద్ద‌తు.. అందుకోస‌మేనా..?

తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. జయలలిత నేతృత్వంలో అన్నాడీఎంకే గతంలో గెలిచింది. ఈసారి ప్రతిపక్ష డీఎంకేకు చాన్స్ ఉంది.

అసోంలో గతంలో బీజేపీ గెలిచింది. ఈ ఎన్నికల్లోనూ దానికే ఎడ్జ్ ఉంది. గతంలో వరుసగా ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది.

ఇక పాండిచ్చేరిలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇటీవల కుప్పకూలింది. బీజేపీ, తమిళ పార్టీలు ప్రతిపక్షంగా ఉన్నాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్