బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. రూ.70వేల వేతనంతో జాబ్స్..?

బెంగళూరులోని ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ 68 ప్రాజెక్ట్‌ ఇంజనీర్ల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులను కోరుతోంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.ada.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. […]

Written By: Navya, Updated On : July 17, 2021 11:15 am
Follow us on

బెంగళూరులోని ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ 68 ప్రాజెక్ట్‌ ఇంజనీర్ల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులను కోరుతోంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.ada.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారిలో రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లకు రూ. 50,000+ డియర్‌నెస్‌ అలవెన్స్, నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లకు రూ. 60,000+ డియర్‌నెస్‌ అలవెన్స్, ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లకు రూ.70,000+ డియర్‌నెస్‌ అలవెన్స్‌ ఇస్తారు. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 35 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ, ఫైనల్‌ పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. 2021 సంవత్సరం జులై 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు భారీగా వేతనం లభిస్తుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. అనుభవం ఉన్నవాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.