Kalki Avatar
Kalki Avatar: ఈ యుగం అంతరించి పోతుందని.. ఇక భూమి మీద మనుషులు ఉండరని అంటున్నారు కొందరు. పాపపుణ్యాలు పెరిగినందుకే ఈ పరిస్థితి రాబోతుందని నమ్ముతున్నారు. అయితే కళియుగం అంతరించే ముందు కల్కి అవతారం వస్తుందని.. కల్కి పేరుతో సాక్ష్యాత్తు ఆ శ్రీమహావిష్ణువే వస్తారట. మరి రాబోయే ముందు ఎలాంటి సంకేతాలు ఉంటాయి. ఇంతకీ ఏం జరగబోతుంది? పండితులు ఏం అంటున్నారు అనే విషయాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.
కళియుగం చిట్టచివరలో కృతయుగానికి ప్రారంభంలో విష్ణువు వస్తారట. దీన్ని ఎలా గుర్తు పట్టాలో కూడా వివరించారు పండితులు. పాపం చేసిన వారికి వ్యాధి వస్తుందని.. ఆసనంలో పుండ్లు పుట్టి రక్తం కారుతుందట. ఇలా జరిగిన చాలా మంది చనిపోతారట. కుప్పులు కుప్పలుగా పడిపోతారట. పుణ్యాత్ములు మాత్రమే ఆరోగ్యంతో ఉంటారట. అంతేకాదు అధికారానికి అర్హత లేకుండా రాజ్యాలను ఏలుతున్న ప్రభువులకు శిక్ష వేస్తాడట.
కృతయుగం ప్రారంభం కంటే ముందు భూమి మీదికి జలప్రళయం వస్తుందట. ఈ నీరు భూమండలాన్ని మొత్తం కప్పేస్తుందట. ఈ విషయాలను విన్న ప్రజలు భయపడుతున్నారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియక ఆందోళన చెందుతున్నారు.