Homeబిజినెస్PMMVY Scheme: మహిళలకు కేంద్రం శుభవార్త.. రెండో కాన్పుకు కూడా డబ్బులు పొందే ఛాన్స్!

PMMVY Scheme: మహిళలకు కేంద్రం శుభవార్త.. రెండో కాన్పుకు కూడా డబ్బులు పొందే ఛాన్స్!

PMMVY Scheme: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం మాతృ వందన యోజన స్కీమ్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ స్కీమ్ ను కేంద్రం మహిళలకు తొలి కాన్పు విషయంలో మాత్రమే అమలు చేస్తోంది. అయితే అతి త్వరలో కేంద్రం రెండో కాన్పుకు కూడా ఈ స్కీమ్ ను అమలు చేయనుందని వార్తలు వస్తున్నాయి.

PMMVY Scheme
PMMVY Scheme

కేంద్ర ప్రభుత్వం రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే ఈ స్కీమ్ అందించాలని భావిస్తోందని బోగట్టా. ఇప్పటివరకు భర్త ఆధార్ కార్డ్ వివరాలను తీసుకొని కేంద్రం ఈ స్కీమ్ ద్వారా డబ్బులు జమ చేసేది. ఇకపై ఈ నిబంధన విషయంలో కూడా కేంద్రం మార్పు చేయనుందని తెలుస్తోంది. కొత్త నిబంధనల వల్ల మహిళలకు చాలా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. ఎక్స్‌పెండిచర్ ఫైనాన్స్ కమిటీ ప్రతిపాదనల ప్రకారం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

Also Read: కాంగ్రెస్ ను కాదని.. వందేళ్ల అధికారం మోడీకి సాధ్యమేనా?

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి 51.7 లక్షల మంది లబ్ధిదారులు బెనిఫిట్స్ పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఈ సాయం అందించనుంది. తొలి విడతలో 1,000 రూపాయలు, రెండో విడతలో 2,000 రూపాయలు మూడో విడతలో 2,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆశా వర్కర్ ను సంప్రదించి ఈ స్కీమ్ లో చేరవచ్చు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందడానికి అర్హత కలిగి ఉండరనే సంగతి తెలిసిందే. కేంద్రం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడంపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Also Read: మ‌హిళా కానిస్టేబుళ్ల‌కు జెంట్స్ టైల‌ర్ తో కొల‌త‌లా?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular