Lakshadweep
Lakshadweep : లక్షద్వీప్ భారతదేశంలోని చాలా అందమైన ద్వీపం. గజిబిజీగా ఉండే ఈ నగర జీవితం నుంచి ప్రశాంతత కోరుకునే వాళ్లు అక్కడకు వెళితే ప్రకృతిని ఆస్వాదించవచ్చు అలాగే అనేక క్రీడా కార్యకలాపాలను కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్రదేశంలో కుటుంబంతో కొంత ప్రత్యేక సమయాన్ని గడపవచ్చు అలాగే అనేక మరిచిపోలేన అనుభవాలను పొందవచ్చు. లక్షద్వీప్ సరిగ్గా మాల్దీవులు లాంటిది. కానీ అందరూ పెంపుడు జంతువుగా పెంచుకునేందుకు ఇష్టపడే ఒక జంతువు ఇక్కడ నిషేధించబడింది. ఈ జంతువును ఏ వీధిలో వెతికినా లక్షద్వీప్లో మాత్రం ఎక్కడా చూడలేరు.
ఈ జంతువు మరెవరో కాదు కుక్క. దాదాపు అందరూ కుక్కను పెంచుకోవడానికి ఇష్టపడతారు. కుక్కను మనిషికి అత్యంత నమ్మకమైన స్నేహితుడిగా భావిస్తారు. కానీ లక్షద్వీప్లో ఎక్కడా మీరు ఒక్క కుక్కను కూడా చూడలేరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. లక్షద్వీప్ రేబిస్ రహిత రాష్ట్రం. అంతేకాకుండా, ఈ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు కుక్కలను తమతో తీసుకెళ్లడానికి కూడా అనుమతి లేదు. పెంపుడు జంతువులు, పెంపుడు జంతువులు కాని అన్ని రకాల కుక్కలను లక్షద్వీప్కు తీసుకెళ్లడాన్ని ప్రభుత్వం నిషేధించింది. అయితే, లక్షద్వీప్లో పిల్లులు, ఎలుకలు విస్తారంగా కనిపిస్తాయి. ఇక్కడ మీరు అన్ని వీధుల్లో, రిసార్ట్ చుట్టూ పిల్లులు, ఎలుకలను చూస్తారు.
ఈ జీవి కూడా లక్షద్వీప్లో కూడా కనిపించదు.
కుక్కలే కాదు, మీరు ఇక్కడ ఒక్క పామును కూడా చూడలేరు. ఇది పాములు లేని రాష్ట్రం కూడా. లక్షద్వీప్ వృక్షజాలం, జంతుజాలం ప్రకారం.. పాములు కనిపించని ఏకైక రాష్ట్రం లక్షద్వీప్. పాముల గురించి మాట్లాడుకుంటే భారతదేశంలో కేరళలో అత్యధిక సంఖ్యలో పాముల జాతులు కనిపిస్తాయి. ఇక్కడ విషపూరిత పాముల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది లక్షద్వీప్ పొరుగు రాష్ట్రం.
600 కంటే ఎక్కువ జాతుల చేపలు
దీనితో పాటు లక్షద్వీప్లో చేపలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. ఇక్కడ మీరు వివిధ జాతుల చేపలను చూస్తారు. లక్షద్వీప్లో 600 కంటే ఎక్కువ జాతుల చేపలు కనిపిస్తాయని సమాచారం. లక్షద్వీప్ రాష్ట్ర జంతువు సీతాకోకచిలుక చేప. కనీసం అర డజను రకాల సీతాకోకచిలుక చేపలు ఇక్కడ కనిపిస్తాయి.
మొత్తం జనాభా దాదాపు 64 వేలు.
36 చిన్న దీవులతో కూడిన లక్షద్వీప్ మొత్తం జనాభా దాదాపు 64000. దాని జనాభాలో 96 శాతం మంది ముస్లింలు. కానీ ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు, లక్షద్వీప్లో ప్రధాన ఆదాయ వనరులు పర్యాటకం, చేపలు.
10 దీవులలో నివసిస్తున్న ప్రజలు
లక్షద్వీప్లో 32 ద్వీపాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ పది దీవులలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో కవరట్టి, అగట్టి, అమిని, కడమత్, కిల్తాన్, చెట్లాట్, బిట్రా, ఆండో, కల్పెని, మినికాయ్ ఉన్నాయి. 100 కంటే తక్కువ మంది నివసించే ద్వీపాలు చాలా ఉన్నాయి. కవరట్టి ఇక్కడి రాజధాని.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Lakshadweep do you know the only state in india that does not have a single dog or snake
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com