Homeఎడ్యుకేషన్Layoffs: లే ఆఫ్ లు చూసి భయపడొద్దు: అందుకు పరిష్కార మార్గం ఇదిగో

Layoffs: లే ఆఫ్ లు చూసి భయపడొద్దు: అందుకు పరిష్కార మార్గం ఇదిగో

Layoffs: దిగ్గజ ఐటీ సంస్థలు లే ఆఫ్ లు ప్రకటిస్తున్నాయి. ఆమెరికా నుంచి భారత్ దాకా ఉద్యోగాలు ఊడి పోతున్నాయి. 2008_09 కి మించి మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఎప్పటికి ముగుస్తుందో తెలియదు. అయితే టెక్ లే ఆఫ్ లు చూసి భయపడాల్సిన పనిలేదని, ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరుచుకునే వారికి భవిష్యత్తుపై భరోసా ఎప్పుడూ ఉంటుందని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎంత మంచి హోదాలో ఉన్నా… కృత్రిమ మేధ, ఆగ్ మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాల్టీ వంటి వాటిపై దృష్టి పెట్టి వాటిల్లో నైపుణ్యాలు సాధించిన వారిదే భవిష్యత్తు అని వారు స్పష్టం చేస్తున్నారు..అలాగే… కరోనా అనంతర పరిస్థితిలో నేపథ్యంలో అధికంగా నియమించుకున్న వారిని ఆమెజాన్ వంటి సంస్థలు ఇప్పుడు తొలగిస్తున్నాయని వారు గుర్తు చేస్తున్నారు.. ఉదాహరణకు 2019 నాటికి అమెజాన్ ఉద్యోగుల సంఖ్య ప్యాంటు 7.18 లక్షలు. 2021 చివరికి ఆ సంఖ్య 16 లక్షలకు చేరింది.. ఇప్పుడు మళ్లీ ఆ సంస్థ తన ఉద్యోగులను తగ్గిస్తోంది. ఇక కొన్ని కంపెనీలు అమెరికా, యూరప్ దేశాల్లో తమ సిబ్బందిని తగ్గించుకుని ఇండియా వంటి దేశాల నుంచి రిమోట్ గా పని చేసే వారిని నియమించుకునే ప్రణాళికల్లో ఉన్నాయి.. కాబట్టి మన టెకీ లకు మంచే జరుగుతుందని ఐటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Layoffs
Layoffs

ఇక విదేశీయులతో పోలిస్తే మన వాళ్లకు కంపెనీలు ఇచ్చే వేతనాలు తక్కువ. అంతేకాదు భారతీయులకు ప్రతిభ కూడా ఎక్కువ.. కాబట్టి కంపెనీలు విదేశీ సిబ్బందిని తొలగించి, కీలక ప్రాజెక్టుల్లో మన వారిని నియమించే అవకాశాలను పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఇక ఏడాది మొదటి 15 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు రోజుకు సగటున 16 వందల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. అవి బయటకు చెబుతున్న కారణమేంటంటే… వారిలో సరైన నైపుణ్యాలు లేవని… పైగా కంపెనీలు ఆర్థికమాంద్యం నేపథ్యంలో పెద్దపెద్ద ప్రాజెక్టులు లేక ఆర్థికంగా కష్టాలు పడుతున్నాయి.. అమెరికా లాంటి ఫెడరల్ బ్యాంకులు వడ్డీరేట్లను భారీగా పెంచాయి.. దీంతో కంపెనీలకు నగదు లభ్యత ఆశించినంత స్థాయిలో ఉండటం లేదు.. ఇది భవిష్యత్తు ప్రణాళికలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

మెరుగుపరుచుకోవాలి

కంప్యూటర్ యుగం ప్రారంభమైన తర్వాత సి ప్లస్ కు డిమాండ్ భారీగా ఉండేది. తర్వాత జావా, ఒరాకిల్ తెరపైకి వచ్చాయి. 2007 తర్వాత స్మార్ట్ ఫోన్లు రావడంతో సమాచార విప్లవం మరింత ఉధృతమైంది..యాప్ లు కూడా రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి ఒక్కసారి గా మారిపోయింది.. ఇదే సమయంలో కొత్త కొత్త సాంకేతికలు పుట్టుకొచ్చాయి. అందులో ముఖ్యమైనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇది ఇప్పుడు అన్ని రంగాలను శాసిస్తోంది.

Layoffs
Layoffs

దీనివల్ల ఉద్యోగాలకు కూడా కోతపడుతున్నది. అయితే లే ఆఫ్ నేపథ్యంలో ఐటీ కంపెనీలో అందరూ ఉద్యోగులను బయటికి పంపడం లేదు. తమ అవసరాలకు అనుగుణంగా ఉన్న వారిని మాత్రం ఉంచుకుంటున్నాయి.. వారికి వేతనాలు కూడా పెంచుతున్నాయి.. కారణాలు ఎలా ఉన్నప్పటికీ నైపుణ్యం పెంచుకుంటేనే భవిష్యత్తు ఉంటుందన్న అవసరాన్ని ఐటి ఉద్యోగులు గుర్తు ఎరగాలి.. లేకుంటే పింక్ స్లిప్ అందుకోవడం ఖాయం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Oktelugu Epaper
Exit mobile version