Baba Vanga: భూమికి, మనిషి దూరమయ్యే సమయం వచ్చేసిందా? బాబా వంగా చెప్పిన జ్యోతిష్యం వైరల్

బల్గేరియన్ కు చెందిన బాబా వంగా ప్రపంచలోనే ఫేమస్. ఈమె ప్రకృతి వైఫరీత్యాల కారణంగా తన చూపును కోల్పోయింది. దీంతో 1996 నుంచే ఆమె ప్రపంచాన్ని చూడడం కోల్పోయింది. అయితే బాబా వంగా అప్పటి నుంచి చెబుతున్న కొన్ని విషయాలు కళ్లెదుటే కనిపించాయి.

Written By: Neelambaram, Updated On : August 31, 2024 3:10 pm

Baba Vanga predictions

Follow us on

Baba Vanga: భవిష్యత్ లో జరిగే విషయాలపై అవగాహన ఉంచుకునేందుకు జ్యోతిష్య శాస్త్రాన్ని సంప్రదిస్తాం. జీవితంలో ఏమైనా ప్రమాదాలు ముంచుకొస్తున్నాయంటే వాటికి పరిహారంగా ముందుగానే జాగ్రత్త పడుతూ ఉంటాం. ఈ క్రమంలోకొందరు జ్యోతిష్యులు భవిష్యత్ లో ఎదురయ్యే ప్రమాదాల గురించి ముందే అంచనా వేస్తుంటారు. వారు చెప్పే విషయాలు ఒక్కోసారి నిజం కావడంతో వారిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అలా బాబా వంగా జ్యోతిష్యం చెప్పడంలో ప్రత్యేకత సాధించింది. ఆమె చెప్పిన విషయాలు కొన్ని ఇప్పటికే నిజం కావడంతో.. ఇప్పుడు మరికొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. మనిషి అంతమయ్యే సమయం అతి దగ్గర్లోనే ఉందని బాబా వంగా ఎప్పుడో చెప్పింది. అప్పటి నుంచి కొన్నేళ్లోనే మనిషి భూమికి దూరం అయిపోతాడని అంచనా వేసింది. అయితే అ పరిస్థితి ఎప్పటి నుంచి?

బల్గేరియన్ కు చెందిన బాబా వంగా ప్రపంచలోనే ఫేమస్. ఈమె ప్రకృతి వైఫరీత్యాల కారణంగా తన చూపును కోల్పోయింది. దీంతో 1996 నుంచే ఆమె ప్రపంచాన్ని చూడడం కోల్పోయింది. అయితే బాబా వంగా అప్పటి నుంచి చెబుతున్న కొన్ని విషయాలు కళ్లెదుటే కనిపించాయి. ఆమెకు చూపు లేకపోయినా బాబా చెప్పిన విషయాలపై ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇప్పటికే బరాక్ ఒబామా యునైటెడ్ స్టేట్స్ కు అధ్యక్షుుడు అవుతారని చెప్పారు. అలాగే ఐరోపాలో కొన్ని ఘర్షణలు ఉంటాయని అన్నారు. అలాగే ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుందని ముందే చెప్పారు.

అయితే బాబా వంగా చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2025 నుంచి మనిషి భూమికి దూరం అవుతాడని అప్పుడే చెప్పారు. మనిషి పతనం ఈ సంవత్సరం నుంచే ప్రారంభం అవుతుందని ఇప్పటి నుంచి కొన్నేళ్లలోనే మనిషి భూమ్మీద కనిపించడని చెప్పారు. ప్రపంచం అంతం కావడంపై ఇప్పుటికే ఎంతో మంది జోష్యం చెప్పారు. ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ బాబా వంగా చెప్పిన ఈ విషయం బయటకు రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. తూర్పు ఐరోపాపై బాబా చెప్పిన విషయం ఇప్పటికీ అందరూ గుర్తు చేసుకుంటారు. ఆయనకు నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్ అనే పేరు కూడా ఉంది.ఈయన ప్రిన్సెస్ డయానా మరణం, చెర్నోబిల్ అణు విపత్తు గురించి ముందే అంచనా వేసి చెప్పారు.

గతంలో 2012లోనే ప్రపంచం అంతం అవుతుందని కొన్ని కథనాలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఈ విపత్తు నుంచి తప్పుకున్నారని, కానీ మనిషి అంతం కావడానికి సమయం అతిదగ్గర్లోనే ఉందని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఇవన్నీ వట్టి కథనాలే అని కొట్టి పారేసినప్పటికటీ బాబా వంగా చెప్పడంపై అందరూ దృష్టి పెట్టారు. ఇప్పటికే కొందరు జ్యోతిష్యులు కల్కి అంతానికి ఆరంభం త్వరలోనే ఉంటుందని చెబుతుండగా ఇదే సమయంలో బాబా వంగా చెప్పిన ఈ విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం ప్రపంచంలో యుద్దవాతావరణం పురుడుపోసుకుంటుంది. రష్యా, ఉక్రెయిన్ నుంచి ప్రారంభమైన వార్ ఇజ్రాయిల్, గాజా తదితర దేశాలకు పాకింది. అలాగే కొన్ని దేశాల్లో సంక్షోభం నెలకొంటోంది. ఈ తరుణంలో బాబా వంగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు ఇప్పటికే కొందరు శాస్త్రవేత్తలు సైతం మూడో ప్రపంచానికి నాంది పడోచ్చేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.