
కరోనా మహమ్మారితో భారత్ రెండోసారి అల్లాడిపోతోంది. ప్రతి రోజు లక్షలాది కేసులు కొత్తగా వెలుగుచూస్తున్నాయి. మరోవైపు మెడికల్ ఆక్సిజన్ యాంటీవైరల్ డ్రగ్ రెమ్ డెసివిర్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా స్పందించింది. భారత్ కు ఈ రెండింటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. వచ్చే 15 రోజుల్లోొనే వాటిని పంపాలని నిర్ణయించినట్లు సమాచారం వారానికి 3,00,000, 4,00,000 చేస్తామని రష్యా ముందుకొచ్చినట్టు ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది.