spot_img
Homeఆంధ్రప్రదేశ్‌డా.పార్థసారథికి బీజేపీలో కీలకపదవి

డా.పార్థసారథికి బీజేపీలో కీలకపదవి

 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తాజాగా కీలక కమిటీలను నియమించింది. ఈరోజు ఢిల్లీలో కేంద్ర బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ నేతలను నియామకం చేస్తూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న ఏపీకి చెందిన ప్రముఖ నేత డా.పార్థసారథికి బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. గత 2019 ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు ఈ నియామకాల్లో పెద్దపీట వేసింది. అంతేకాకుండా మొన్న జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జిగా కూడా పార్థసారథి బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఏపి- బీజేపీ మీడియా ప్యానెల్ లిస్ట్ గా కూడా కొనసాగుతున్నారు.

వృత్తిపరంగా దంతవైద్యుడు అయిన పార్థసారథి ‘పార్థ డెంటల్ ’ పేరుతో దేశ వ్యాప్తంగా డెంటల్ క్లినిక్ లు నడుపుతూ సేవ చేస్తున్నారు. ఈ సందర్భంగా డా.పార్థసారథిని భారతీయ జనతా పార్టీ ఏకంగా జాతీయస్థాయి పదవి అయిన ‘ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి’గా నియమించింది.

ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి’గా నియామకమైన తర్వాత డా.పార్థసారథి మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే పార్టీ గుర్తిస్తుందనడానికి ఈ పదవే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. నాపై నమ్మకంతో నాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి , రాష్ట్ర ఇన్చార్జిలు మురళీధరన్ , సునీల్ దేవధర్ లకు ధన్యవాదాలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి నన్ను ఎంచుకున్నందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని.. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Oktelugu Epaper
Exit mobile version