
రిలయన్స్ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు మే 1 నుంచి కోవిడ్ నిరోధక వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబాల్లొని 18 సంవత్సరాల వయసు పై బడిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని ఆలస్యం చేయకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరింది. ఆర్ సురక్ష పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించునున్నట్లు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఓ లేఖలో వెల్లడించారు. రిలయన్స్ సంస్థలోని దాదాపు 3 లక్షల మంది ఉద్యొోగులను ఉద్దేశించి ముఖేశ్ నీతా దంపతులు ఈ లేఖ రాశారు. రాబోయే వారాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.