రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై మంత్రివర్గ సమావేశం మరోసారి సమావేశమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఉద్యోగ నియామకాలు, ఖాళీల గుర్తింపు, జాబ్ క్యాలెండర్ నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకొనున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి వరుసగా రెండోరోజు బుధవారం మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులు పూర్తి వివరాలతో హాజరయ్యారు.