Sukumar remuneration : సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు పాన్ ఇండియా డైరెక్టర్లుగా మారిన తర్వాత వాళ్ల రెమ్యూనరేషన్ ను భారీ స్థాయిలో పెంచేశారు. ఎందుకంటే వాళ్ళు చేసే సినిమాలకు ఇండియా వైడ్ గా పాపులారిటి దక్కుతుంది. అలాగే కలెక్షన్స్ సైతం భారీగా వస్తున్నాయి. కాబట్టి ఆయా దర్శకులు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అయితే ఛార్జ్ చేస్తున్నారు… ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిన సుకుమార్ ఆ తర్వాత చేయబోయే రామ్ చరణ్ సినిమా కోసం దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి…నిజానికి సుకుమార్ కంటే కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకునే దర్శకులు ముగ్గురు ఉన్నారు. ఇక మొదటి ప్లేస్ లో రాజమౌళి ఉన్నాడు. ఒక సినిమా కోసం రాజమౌళి 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక అతని తర్వాత స్థానంలో ప్రశాంత్ నీల్ ఒక సినిమా కోసం 120 కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుంటున్నాడు. సందీప్ రెడ్డి వంగ సైతం 110 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సుకుమార్ కంటే కూడా వీళ్ళు ముగ్గురు ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
కాబట్టి వీళ్ళు కూడా టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు. మొత్తానికైతే సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాతో 3000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఆ మూవీని నిలపాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక దానికోసమే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా ఎఫెక్టివ్ గా చేస్తున్నాడు…
రామ్ చరణ్ తో చేయబోయే సినిమా విజువల్ వండర్ ని క్రియేట్ చేయబోతుందట. ఈ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడిని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అంటూ సుకుమార్ తన సన్నిహిత వర్గాల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తుంది…
ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతోనే సుకుమార్ ముందుకు అడుగులు వేస్తున్నాడు. దానికోసమే కథ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా క్లారిటిని మెయిటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
