ఈరోజు ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలకు ఐటీ, ఎఫ్ ఎంసీజే షేర్లు అండగా నిలిచాయి. దీంతో మార్కెట్లు పరుగులు పెట్టాయి. 57,423 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒక ధశలో 57,892 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి 514 పాయింట్ల లాభంతో 57,852 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ట స్థాయిలో ముగిసింది. అటు జాతీయ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 158 పాయింట్లు ఎగబాకి 17, 234 వద్ద కొత్త రికార్డులో స్థిరపడింది.