Homeతాజా వార్తలుSikkim: మిలిటరీ క్యాంప్ పై పడిన కొండచరియలు.. ముగ్గురి మృతి

మిలిటరీ క్యాంప్ పై పడిన కొండచరియలు.. ముగ్గురి మృతి

Sikkim: సిక్కింలోని ఛటేన్ అనే ప్రదేశంలో మిలిటరీ క్యాంప్ పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించగా మరో ఆరుగురి ఆచూకీ గల్లంతైంది. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు సోమవారం ధ్రువీకరించారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురి మృతదేహాలను దళాలు గుర్తించాయి. మరో నలుగురు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆచూకీ గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయక దళాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular