కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన ఆటో పంట కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అ ఘటన మండవల్లి మండలం కానుకోల్లు వద్ద చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.