Homeజాతీయ వార్తలుJammu Kashmir Politics: కాశ్మీర్లో మళ్లీ లుకలుకలు.. మోడీ ఏం చేస్తారు?

Jammu Kashmir Politics: కాశ్మీర్లో మళ్లీ లుకలుకలు.. మోడీ ఏం చేస్తారు?

Jammu Kashmir Politics: జమ్మూ కశ్మీర్‌లో సాధారణంగా ఉగ్రవాదం లేదా అభివృద్ధి అనే అంశాలే వార్తల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య హడావుడి పెరిగింది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఉమర్‌ అబ్దుల్లా హజ్రత్‌బల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ‘ఆపరేషన్‌ లోటస్‌’ నిర్వహిస్తోందని ఆరోపించారు.

ఉమర్‌ ఆవేశపూరిత ప్రసంగం..
షేక్‌ అబ్దుల్లా సమాధి వద్ద జరిగిన సమావేశంలో ఉమర్‌ అబ్దుల్లా కేంద్రం మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు డబ్బు ఇవ్వడం, మంత్రి పదవులు ఇవ్వడం, రాష్ట్ర హోదా పునరుద్ధరణ వంటి ఆశలు చూపడం జరుగుతోందని అన్నారు. కార్యకర్తలు ‘‘అమ్ముడు పోయేది ఎవరు?’’ అనే నినాదాలు చేశారు. ఉమర్‌కు మద్దతు తెలిపి భరోసా ఇచ్చారు. ఈ ప్రసంగం ఆవేశంగా ఉండటం వల్ల రాజకీయ ఉద్రిక్తత పెరిగింది.

బలంగా ప్రభుత్వం..
జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీలో 90 సీట్లు ఉన్నాయి. మెజారిటీకి 46 సీట్లు కావాలి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు 42 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్‌ 6 మంది, సీపీఎం ఒకరు, స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతుతో మొత్తం 50 సీట్ల మద్దతు ఉంది. ఇది ప్రభుత్వాన్ని సంఖ్యాపరంగా చాలా బలంగా చేస్తుంది. బీజేపీకి 29 సీట్లు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించాలి. మహబూబా ముఫ్తీ పార్టీ బీజేపీతో కలవడం లేదు. ఆప్‌కు ఒక సీటు కూడా మద్దతు ఇవ్వదు. క్రై సిస్‌ వచ్చినప్పుడు చాలా మంది ఉమర్‌ వైపు వెళ్లే అవకాశం ఉంది. అందుకే లేని సంక్షోభాన్ని సృష్టించి హడావుడి చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సెపరేటిస్ట్‌ ఎకోసిస్టమ్‌పై కేంద్రం చర్యలు
ఉమర్‌ ప్రసంగం వెనుక ముఖ్య కారణం సెపరేటిస్ట్‌ ఉద్యమం పునాదులు కదలడం. ఒకప్పుడు హురియత్‌ కాన్ఫరెన్స్‌ లోయలో రాజకీయ నిర్ణయాలు తీసుకునేది. 2017లో జరిగిన ఒక ఘటనలో హురియత్‌ నాయకులపై కేసు నమోదు అయింది. ఇప్పుడు చార్జిషీట్‌ దాఖలు అయింది. ఉగ్రవాది అంతిమయాత్రలో చేసిన ప్రసంగాల వల్ల పోలీసులపై దాడి జరిగి, ఒక మిలిటరీ అధికారి మరణించారు. ఇలాంటి చర్యలు వేర్పాటు వాదం నుంచి ఉగ్రవాదంగా మారకుండా నిరోధించడానికి ఉద్దేశించినవి.

జైష్‌–ఎ–మొహమ్మద్‌కు చెందిన ఉగ్రవాది ఇంతియాజ్‌ అహ్మద్‌పై కేసు వేగంగా జరుగుతోంది. ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు కూడా ఉంది. ఇలాంటి పరిణామాలు గతంలో సెపరేటిస్ట్‌ ఎకోసిస్టమ్‌ను బలహీనపరుస్తున్నాయి. దీంతో కొంతమంది రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

ఉమర్‌ మాటల్లోని మూడు విధానాలు
కశ్మీర్‌ నాయకులు స్థలాన్ని బట్టి మాటలు మార్చుకుంటారు. లోయలో ఉన్నప్పుడు రక్తపాతం, ఆర్టికల్‌ 370 రద్దు వల్ల ప్రళయం వంటి మాటలు. జమ్మూ వచ్చినప్పుడు ఐక్యత, కలిసి బతకడం అని మాట్లాడతారు. ఢిల్లీ వచ్చినప్పుడు దేశభక్తి, కశ్మీర్‌ భారత్‌లో భాగమని ప్రకటిస్తారు. ఇలా మూడు విధాలుగా మాట్లాడడం సాధారణ రాజకీయ వ్యూహంగా కనిపిస్తుంది.

రాజకీయ వ్యూహమా?
సంఖ్యాపరంగా ఉమర్‌ ప్రభుత్వం బలంగా ఉన్నప్పటికీ, ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా తమ మద్దతుదారులను సమీకరించడం, కేంద్ర చర్యలను వ్యతిరేకించడం లక্ষ్యం కావచ్చు. గతంలో సెపరేటిస్ట్‌ ఎకోసిస్టమ్‌ రాజకీయాలను ప్రభావితం చేసేది. దాని పునాదులు కదలడం వల్ల కొంతమందికి రాజకీయ ప్రాబల్యం తగ్గుతోంది. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ద్వారా కేంద్రం నేరుగా నియంత్రణలో ఉండడం వల్ల సాంప్రదాయ రాజకీయ నాయకుల ప్రభావం తగ్గింది.

ఈ హడావుడి అసలైన సంక్షోభం కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం అనిపిస్తుంది. కశ్మీర్‌లో దీర్ఘకాలిక మార్పులు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు ఇలాంటి ప్రసంగాల ద్వారా ప్రజలను కదిలించడానికి ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్‌లో ఎన్నికలు లేదా ఇతర అంశాల్లో ఇది ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి. మొత్తంగా, స్థిరత్వం కాపాడుకోవడం, అభివృద్ధి కొనసాగడం ముఖ్యం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version