బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అది మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో చాలా చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో ఒకట్రెండు చోట్ల మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.