జైళ్లో ఖైదీల గ్యాంగ్ వార్.. ముగ్గురు మృతి

ఖైదీల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ లో ముగ్గురు అండర్ ట్రయల్ ఖైదీలు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హై సెక్యూరిటీ కలిగిన చిత్ర కూట్ జైలులో శుక్రవారం చోటుచేసుకుంది. నివేదిక ప్రకారం అండర్ ట్రయల్ ఖైదీ అన్షుల్ దీక్షిత్ మరో గ్యాంగ్ స్టర్ ముఖీమ్ కాలా పై తుపాకితో కాల్పులు జరిపాడు. సంఘటన స్థలంలోనే అతడు చనిపోయాడు. బుల్లెట్లు దూసుకెళ్లిన మరో క్రిమినల్ మీరాజుద్దీన్ తీవ్రయాల అనంతరం మరణించాడు. మీరాజుద్దీన్ ను మాఫియా డాన్, […]

Written By: Suresh, Updated On : May 14, 2021 3:19 pm
Follow us on

ఖైదీల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ లో ముగ్గురు అండర్ ట్రయల్ ఖైదీలు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హై సెక్యూరిటీ కలిగిన చిత్ర కూట్ జైలులో శుక్రవారం చోటుచేసుకుంది. నివేదిక ప్రకారం అండర్ ట్రయల్ ఖైదీ అన్షుల్ దీక్షిత్ మరో గ్యాంగ్ స్టర్ ముఖీమ్ కాలా పై తుపాకితో కాల్పులు జరిపాడు. సంఘటన స్థలంలోనే అతడు చనిపోయాడు. బుల్లెట్లు దూసుకెళ్లిన మరో క్రిమినల్ మీరాజుద్దీన్ తీవ్రయాల అనంతరం మరణించాడు. మీరాజుద్దీన్ ను మాఫియా డాన్, బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ సన్నిహితుడిగా చెబుతారు. దీక్షిత్ ను లొంగిపోవాల్సిందిగా కోరగా వినకుండా పోలీసులపై కాల్పులు జరపడంతో ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో దీక్షిత్ కూడా చనిపోయాడు.