Prakash Raj పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో సహనం పూర్తిగా నశించిందా..?, నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడే వాళ్లకు మాటలతో కాదు , చేతలతో బుద్ది చెప్పాలని చూస్తున్నారా ?, వీళ్ళని స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కంట్రోల్ చేసే పరిస్థితి లో లేరా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈమధ్య కాలం లో కొంతమంది యూట్యూబర్స్ ఓవర్ నైట్ లో ఫేమ్ అయిపోదామే ఉద్దేశ్యం తో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం చాలా సాధారణం అయిపోయింది. అది పవన్ కళ్యాణ్ వరకే ఆగితే పర్వాలేదు, మతాల మధ్య చిచ్చు పెట్టడం , కులాల మధ్య చిచ్చు పెట్టడం , శ్రీరాముడిని సైతం దుర్భాషలాడే పరిస్థితికి రావడం అనేది సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఇలాంటివన్నీ చేస్తున్న ప్రశ్న రావణ్ ని అందుకే పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం ఇతనికి మచిలీపట్టణం పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఇతను బయటకి వస్తే దాడి చేయడానికి పవన్ కళ్యాణ్ అభిమానులు స్టేషన్ బయటే కాచుకొని రెడీ గా ఉన్నారు. పిఠాపురం , సర్పవరం పోలీస్ స్టేషన్స్ వద్దనే రావణ్ పై దాడి చేసేందుకు పవన్ ఫ్యాన్స్ దూసుకొచ్చారు. కానీ మచిలీపట్టణం లో పవన్ ఫ్యాన్స్ ఆవేశాన్ని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. దీనిని ప్రకాష్ రాజ్ వంటి వారు ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు. ఆయన మాట్లాడుతూ ‘ఏంటో..జన సైనికులు బాగా రెచ్చిపోతున్నారు. వీళ్ళు జన సైనికులా ?, లేదంటే గూండాలా?, ప్రశ్నించాడని పోలీసులను పంపించి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బెయిల్ మీద బెయిల్ ఇస్తున్నారు కోర్టు వారు , అరెస్టుల మీద అరెస్టులు వీళ్ళు చేస్తున్నారు , ఈ కొత్త నాటకం ఏంటి ?, ఈ బెదిరింపులు ఏంటి?, ఈ జనసైనికులు ప్రశ్నించే వాళ్ళను చంపేస్తారా ఏంటి?, దేశం చూస్తుంది జాగ్రత్త’ అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెప్పుకొచ్చారు.
దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా గట్టిగానే కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. చాలా తెలివిగా , ప్రశ్నిస్తే చంపేస్తారా అని ప్రకాష్ రాజ్ లాంటోళ్ళు తెగ రుద్దేస్తున్నారు, కానీ రావణ్ మాట్లాడిన దుర్మార్గమైన మాటలను మాత్రం అసలు పరిగణలోకి తీసుకోవడం లేదు , కావాలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధారాలతో సహా , రావణ్ దుర్మార్గమైన మాటలను సోషల్ మీడియా లో తిప్పుతున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కాస్త శాంతిస్తే బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు. రావణ్ అంటే ఎవరో జనాలకు అసలు తెలియదని , అతనికి కావాలని పాపులారిటీ ని తీసుకొస్తున్నది పవన్ ఫ్యాన్స్ అని , ఏదైనా చట్టపరమైన చర్యలే న్యాయబద్ధమని , దాడి చేయడం సరికాదు అంటూ సోషల్ మీడియా సాక్షిగా చెప్పుకొస్తున్నారు.
What is this act of your janasena party cadres . ప్రశ్నిస్తే చంపేస్తారా ???. @ncbn @PawanKalyan … Will you take action against this Rogue behaviour. #justasking pic.twitter.com/HZYEIaKbfp
— Prakash Raj (@prakashraaj) July 3, 2026

