ఏపీలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పరిస్థితులు చక్కబడిన తరువాత ఇంటర్ పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహఇంచడం సరికాదని పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.