MS Dhoni retirement : టీమిండియాలోనే కాదు.. ఐపీఎల్ లో కూడా ధోని సాధించిన రికార్డులు మామూలుగా లేవు. చెన్నై జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపిన చరిత్ర ధోనీకి ఉంది. టీమిండియా కు t20, వన్డే, పంపియన్స్ ట్రోఫీలు అందించిన చరిత్ర కూడా అతడిది. టీమిండియా క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయదగిన అధ్యాయాలు అనేకం నెలకొల్పాడు ధోని.
ధోని ప్రస్తుతం నాలుగు పదుల వయసు దాటిపోయాడు. చెన్నై జట్టుకు ఒకప్పుడు సారధిగా ఉన్న అతడు.. ఇప్పుడు ఒక ఆటగాడి గానే మిగిలిపోయాడు. గత సీజన్లో అతడు తాత్కాలిక సారధిగా వ్యవహరించాడు. ఆరోగ్యం బాగాలేక పోవడం వల్ల ఈ సీజన్లో ఇంతవరకు మైదానంలో అడుగుపెట్టలేదు. అయితే ధోని కి సంబంధించి చెన్నై మేనేజ్మెంట్ ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే చెన్నై జట్టు ప్రస్తుతం ఐపీఎల్ లో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బెంగళూరు చేతిలో పంజాబ్ ఓడిపోవడంతో చెన్నై జట్టుకు లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు తరుపున ధోని మైదానంలో అడుగుపెట్టి ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.
హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్లో చెన్నై తరఫున ధోని ఆడతాడని తెలుస్తోంది. ఆ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతుంది. ఆ మ్యాచ్లో ధోని గనక ఆడితే.. చెన్నై అభిమానులకు అద్భుతమైన ఆనందం లభిస్తుంది. అంతేకాదు ఈ మ్యాచ్ లో గెలిస్తే ధోని తదుపరి ప్లే ఆఫ్ మ్యాచ్లు కూడా ఆడే అవకాశం ఉంది. ఒకవేళ హైదరాబాద్ చేతిలో చెన్నై విజయం సాధించకపోతే.. ధోని ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.
ఇదే విషయాన్ని చెన్నై మేనేజ్మెంట్ పరోక్షంగా ఇటీవల కాలంలో చెబుతూ వస్తోంది. దీనిపై అభిమానులకు కూడా హింట్ ఇస్తోంది. ఇదే కనక జరిగితే చెన్నై అభిమానులు ఇబ్బంది పడడం ఖాయం. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ.. ధోనిని చెన్నై అభిమానులు తలా అని పిలుచుకుంటారు. అతడి నాయకత్వం లో చెన్నై సాధించిన విజయాలను గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే ఆస్థానాన్ని.. ఎవరు భర్తీ చేస్తారని చెన్నై అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఏదో ఒక రూపంలో చెన్నై జట్టుతో అతడు కొనసాగుతాడని మేనేజ్మెంట్ చెబుతోంది. ఒకవేళ అతని కోచ్ గా నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.