మేడ్చల్ లో భారీ అగ్ని ప్రమాదం

మేడ్చల్ జిల్లా దుండిగల్లోని గండిమైసమ్మ చౌరస్తా వద్ద మణికంఠ ప్లాస్టిక్ దుకాణంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దుకాణం తెరచే ఉంది. మధ్యాహ్నం ఒంటి గంటకు యజమాని దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లాడు. కాసేపటికే దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో పొగలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదంలో సుమారు రూ. […]

Written By: Velishala Suresh, Updated On : June 4, 2021 5:54 pm
Follow us on

మేడ్చల్ జిల్లా దుండిగల్లోని గండిమైసమ్మ చౌరస్తా వద్ద మణికంఠ ప్లాస్టిక్ దుకాణంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దుకాణం తెరచే ఉంది. మధ్యాహ్నం ఒంటి గంటకు యజమాని దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లాడు. కాసేపటికే దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో పొగలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని యజమాని అంచనా వేశారు.