Site icon OkTelugu

వరంగల్ ఎంజీఎంను పరిశీలించిన కేసీఆర్

సీఎం కేసీఆర్ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, రెమ్ డెసివిర్, ఇతర మందుల లభ్యత తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించనున్నారు. ఎంజీఎం పర్యటన అనంతరం వరంగల్ సెంట్రల్ జైలును ఆయన పరిశీలించనున్నారు. జైలు ప్రాంగణంలో ని 73 ఎకరాల్లో కొత్త ఆస్పత్రి నిర్మాణంపై అధికారులతో కేసీఆర్ చర్చించనున్నారు.

Exit mobile version