ప్రముఖ విలన్ కు చిరంజీవి రెండు లక్షలు సాయం

కరోనా కల్లోలంలో ఆదాయం లేక అష్టకష్టాలు పడుతున్న ఎంతో మంది సినీ కళాకారులను మెగాస్టార్ చిరంజీవి ఆదుకుంటూ తన మంచి మనసు చాటుకుంటున్నాడు. కోట్లు సంపాదించడమే కాదు.. కష్టాల్లో ఉన్న తోటి కళాకారులను ఆదుకోవడం కూడా తమ బాధ్యత అని చిరంజీవి నిరూపిస్తున్నాడు. ఇప్పటికే నిన్న కరోనా లాక్ డౌన్ తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పావలా శ్యామలకు లక్ష రూపాయలు ఇచ్చి చిరంజీవి ఆదుకున్నాడు. తాజాగా తమిళ విలన్, నటుడు పొన్నాంబళం కిడ్నీ ఆపరేషన్ కు […]

Written By: NARESH, Updated On : May 21, 2021 2:01 pm
Follow us on

కరోనా కల్లోలంలో ఆదాయం లేక అష్టకష్టాలు పడుతున్న ఎంతో మంది సినీ కళాకారులను మెగాస్టార్ చిరంజీవి ఆదుకుంటూ తన మంచి మనసు చాటుకుంటున్నాడు. కోట్లు సంపాదించడమే కాదు.. కష్టాల్లో ఉన్న తోటి కళాకారులను ఆదుకోవడం కూడా తమ బాధ్యత అని చిరంజీవి నిరూపిస్తున్నాడు.

ఇప్పటికే నిన్న కరోనా లాక్ డౌన్ తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పావలా శ్యామలకు లక్ష రూపాయలు ఇచ్చి చిరంజీవి ఆదుకున్నాడు. తాజాగా తమిళ విలన్, నటుడు పొన్నాంబళం కిడ్నీ ఆపరేషన్ కు చిరంజీవి సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా పొన్నంబళం ఒక వీడియో తీసి చెప్పడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం ప్రస్తుతం ఆస్పత్రిలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నాడు. కిడ్నీ సమస్యతో పొన్నంబళం బాధపడుతున్నారని తెలిసి వెంటనే చిరంజీవి స్పందించారు. ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రెండు లక్షల రూపాయలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు గురువారం ట్రాన్స్ ఫర్ చేశారు.

పొన్నాంబళం చెన్నైలో నివాసముంటారు. అక్కడే కిడ్నీ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనకు రెండు లక్షల రూపాయలు సహాయం చేశాడని పొన్నాంబళం మెగాస్టార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి నటించిన ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు తదితర చిత్రాల్లో పొన్నాంబళం నటించారు. ఆయా సినిమాల్లో వీరిద్దరి మధ్యా జరిగే ఫైట్స్ ను అప్పట్లో జనం తెగ ఎంజాయ్ చేశారు.

తన ఆరోగ్యం కుదుటపడటం కోసం చిరంజీవి నుంచి సాయం అందిందని తెలియగానే పొన్నాంబళం ఫోన్ ద్వారా తన కృతజ్ఞతలను చిరంజీవికి తెలిపారు. ‘చిరంజీవి అన్నయ్యకు నమస్కారం, చాలా ధన్యవాదాలు అన్నయ్యా… నాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం మీరు పంపిన రెండు లక్షల రూపాయలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సహాయాన్ని నేనెప్పటికీ మరచిపోలేను. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ పేరున్న ఆ దేవుడు ఆంజనేయస్వామి మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలని కోరుకుంటూ… జై శ్రీరామ్‌’ అంటూ తన సందేశాన్ని తమిళంలో వీడియో రూపంలో పంపారు పొన్నాంబళం. ఎంతో సాయం చేసినా చెప్పుకోలేని చిరంజీవి ఘనత మరోసారి బయటకు వచ్చింది. ఇక ప్రతి సినిమాకు 50,100  కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మన స్టార్ హీరోలు సైతం ఇలాంటి సామాజికసేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని పలువురు కోరుతున్నారు.