
కర్ణాటకలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 27 రాత్రి నుంచి మే 12 వ తేదీ వరకు కర్ణాటకలో పాక్షిక లాక్ డౌన్ విధించారు. అయితే ఈ పాక్షిక లాక్ డౌన్ వల్ల కేసుల్లో తగ్గుదల కనిపించడం లేదు. దీంతో ఈ పాక్షిక లాక్ డౌన్ గడువు ముగిసిన వెంటనే అదే రోజు సంపూర్ణ లాక్ డౌన్ విధించేందుకు ప్రభుత్వం సమాయాత్తం అవుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిపై మంగళవారం కేబినెట్ సమావేశం జరిగింది.