తల్లి మందలించిందని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

తల్లి మందలించిందని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం నాగిలిగొండకు చెందిన బాలిక (16) ఖమ్మంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు జరగడం లేదు. ఆన్ లైన్ లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. మొబైల్ లో వీడియో గేమ్ లు ఆడుతూ ఉంటడం గమనించిన తల్లి.. బాలికను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో పురుగుల మందు […]

Written By: Suresh, Updated On : August 12, 2021 4:52 pm
Follow us on

తల్లి మందలించిందని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం నాగిలిగొండకు చెందిన బాలిక (16) ఖమ్మంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు జరగడం లేదు. ఆన్ లైన్ లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. మొబైల్ లో వీడియో గేమ్ లు ఆడుతూ ఉంటడం గమనించిన తల్లి.. బాలికను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది.