
నగరంలోని కుల్సుంపురాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కుల్సుంపురాలోని జియాగూడ వెంకటేశ్వర్ నగర్ కాలనీలో దుండగులు ఐదు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఈ సందర్భంగా దొంగలు ఐదు ఇళ్లలో రూ. 20 లక్షల నగదు, 45 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన ఇళ్లలో క్లూస్ టీమ్ తో పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.