టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి గవర్నర్ తమిళసై ఫోన్ చేశారు. కరోనా భయంకర పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఉత్తమ్ గవర్నర్ కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆయనకు ఫోన్ చేశారు. ఫోన్ లో మరిన్ని వివరాలను గవర్నర్ అడిగా తెలుసుకున్నారు. ఈ విషయం పై రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడతానని ఉత్తమ్ కు గవర్నర్ తమిళి సై హామీ ఇచ్చారు.