గెజిట్ పై రాజకీయాలు చేయొద్దు.. జీవీఎల్

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ విడుదల చేయడంతో ఆయా నదులపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళతాయనే ప్రచారం సరికాదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నదీ బోర్డుల విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్ర పరిధిలో ప్రాజెక్టులకు ఆయా రాష్ట్రాలే నిర్వహించుకుంటాయని స్పష్టం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే కృష్ణా, […]

Written By: Suresh, Updated On : July 17, 2021 7:24 pm
Follow us on

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ విడుదల చేయడంతో ఆయా నదులపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళతాయనే ప్రచారం సరికాదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నదీ బోర్డుల విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్ర పరిధిలో ప్రాజెక్టులకు ఆయా రాష్ట్రాలే నిర్వహించుకుంటాయని స్పష్టం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ జారీ చేసిందని వివరించారు.