Shikhar Dhawan: విడిపోయిన శిఖర్ ధావన్-అయేషా ముఖర్జీ జంట

టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీ జంట విడిపోయారు. ఈ విషయాన్ని అయేషా ముఖర్జీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. దీంతో ఈ జంట ఒక్కసారిగా సాక్ ఇచ్చింది. రెండో సారి విడాకులు తీసుకునే వరకు విడాకులు అనే పదం తనకు చెత్త పదంగా అనిపించేదని అయేషా పేర్కొంది. విడాకుల విషయంపై శిఖర్ ధావన్ ఇంతవరకు స్పందించలేదు. మెల్ బోర్న్ బాక్సర్ అయిన అయేషా ముఖర్జీతో ధావన్ ప్రేమలో పడ్డాడు. దీంతో 2012లో వీరు […]

Written By: Suresh, Updated On : September 8, 2021 8:28 am
Follow us on

టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీ జంట విడిపోయారు. ఈ విషయాన్ని అయేషా ముఖర్జీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. దీంతో ఈ జంట ఒక్కసారిగా సాక్ ఇచ్చింది. రెండో సారి విడాకులు తీసుకునే వరకు విడాకులు అనే పదం తనకు చెత్త పదంగా అనిపించేదని అయేషా పేర్కొంది. విడాకుల విషయంపై శిఖర్ ధావన్ ఇంతవరకు స్పందించలేదు. మెల్ బోర్న్ బాక్సర్ అయిన అయేషా ముఖర్జీతో ధావన్ ప్రేమలో పడ్డాడు. దీంతో 2012లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయేషా ముఖర్జీకి గతంలోనే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిఖర్ ధావన్ తో వివాహం జరిగాక 2014లో వారికి ఒక బాబు పుట్టాడు. దాదాపు 9 ఏళ్ల అనంతరం శిఖర్ జంట తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికింది.