యాస్ తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం

సైక్లోన్ యాస్ ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించే అవశాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సైక్లోన్ తీవ్ర తుఫాన్ గా మారి మే 26న ఒడిశా, బెంగాల్ తీరాలను దాటొచ్చని శనివారం భారత వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. ఆదివారం ఇది మరింత బలపడే అవకాశం ఉంది. […]

Written By: Suresh, Updated On : May 22, 2021 8:25 pm
Follow us on

సైక్లోన్ యాస్ ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించే అవశాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సైక్లోన్ తీవ్ర తుఫాన్ గా మారి మే 26న ఒడిశా, బెంగాల్ తీరాలను దాటొచ్చని శనివారం భారత వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. ఆదివారం ఇది మరింత బలపడే అవకాశం ఉంది. అనంతరం ఇది ఉతర్త, వాయువ్య దిశగా ప్రయాణించి సోమవారినికి తుఫానుగా మారే అవకాశం ఉంది.