
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయను చెన్నైకి తరలించి ఓ కార్పొరేట్ ప్రభు్త్వ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయనలో కరోనా లక్షణాలు వెలుగు చూడటంతో పుదుచ్చేరిలోని ఇందిరాగాంధి ప్రభు్వ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో ఆదివారం పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.