టీంఇండియా క్రికెటర్ కు కరోనా పాజిటివ్

టీంఇండియా క్రికెట్ లో కరోనా కలకలం రేగింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న జట్టులో ఒకరికి కరోనా సోకింది. 23 మందితో కూడిన క్రికెటర్ల బృందంలో ఒకరు కొవిడ్ బారిన పడినట్లు సమాచారం. కాగా ఏ క్రికెటర్ కు కరోనా సోకిందో బీసీసీఐ అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం ఆ క్రికెటర్ కు ఎలాంటి లక్షణాలు లేవని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అతడిని విడిగా క్వారంటైన్లో ఉంచినట్లు స్పష్టం చేశాయి. కొవిడ్ సోకిన క్రికెటర్ మినహా మిగతా జట్టు డర్హమ్ […]

Written By: Velishala Suresh, Updated On : July 15, 2021 9:16 am
Follow us on

టీంఇండియా క్రికెట్ లో కరోనా కలకలం రేగింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న జట్టులో ఒకరికి కరోనా సోకింది. 23 మందితో కూడిన క్రికెటర్ల బృందంలో ఒకరు కొవిడ్ బారిన పడినట్లు సమాచారం. కాగా ఏ క్రికెటర్ కు కరోనా సోకిందో బీసీసీఐ అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం ఆ క్రికెటర్ కు ఎలాంటి లక్షణాలు లేవని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అతడిని విడిగా క్వారంటైన్లో ఉంచినట్లు స్పష్టం చేశాయి. కొవిడ్ సోకిన క్రికెటర్ మినహా మిగతా జట్టు డర్హమ్ కు పయనమైంది.