Congress party crisis : కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై దేశంలో చర్చ జరుగుతున్నాయి. మిత్రపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులో ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే పొత్తు పెట్టుకున్న డీఎంకేను వదిలేసి టీవీకేకు మద్దతు ఇవ్వడంపై మిత్రపక్షాలు జీర్ణించుకోవడం లేదు. ముఖ్యంగా డీఎంకే అంతకు నెలరోజుల ముందే రాజ్యసభ సీటును కాంగ్రెస్ కు ఇచ్చింది.
అలాగే తమిళనాడులో బలం లేకున్నా ఏకంగా 28 సీట్లను కాంగ్రెస్ కు ఇచ్చింది డీఎంకే. అసలు రాహుల్ గాంధీ ప్రచారం చేయకున్నా.. స్టాలిన్ 28 చోట్ల ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థులకు ఆర్థికసాయం కూడా చేశారని తెలిసింది. కానీ.. జరిగింది ఏంటి.. డీఎంకేకు మాట కూడా చెప్పుకుండా కాంగ్రెస్ ఫ్లేటు ఫిరాయించి టీవీకేకు సపోర్టు చేసింది.
ప్రజలు కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలుపలేదు. 28 సీట్లకు 5 సీట్లే గెలిపించారు ప్రజలు. ప్రజలు కూడా మీ వైపు లేరు. అది ఆలోచించుకుండా పవర్ చోరీ కోసం టీవీకేకు మద్దతుగా కాంగ్రెస్ ఫ్లేటు ఫిరాయించింది.
బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో కాంగ్రెస్ ఓడిపోయింది.. తమిళనాడులో ఓడిపోయింది. కేరళలోనే గెలిచింది. ఇది కాంగ్రెస్ కు చాలా డ్యామేజ్ జరిగింది..
కాంగ్రెస్ ని మిత్ర పక్షాలు ఎందుకు నమ్మడంలేదు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోను చూడండి