
పెగాసస్ వ్యవహారం పార్లమెంట్ ను కదిపేస్తోంది. ఈ అంశంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో శుక్రవారం కూడా ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. విపక్షాల ఆందోళనలతో 15 నిమిషాలకే లోక్ సభ వాయిదా పడింది. ఈ ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులతో వెల్ లోకి దూసుకెళ్లి నివాదాలు చేశారు.