Homeజాతీయ వార్తలుCockroach Janata Party : చొచ్చుకొచ్చిన బొద్దింకలు.. దిగొస్తున్న బీజేపీ సర్కార్.. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు

Cockroach Janata Party : చొచ్చుకొచ్చిన బొద్దింకలు.. దిగొస్తున్న బీజేపీ సర్కార్.. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు

Cockroach Janata Party : దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ నగరంలో పోలీసులు సహజంగానే ఆంక్షలు విధిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ ఆంక్షలు మరింత పెరిగిపోయాయి. బారికేడ్లు ఎక్కువైపోయాయి. పోలీసులు అడుగడుగునా తనిఖీలు మొదలుపెట్టారు. ఇదంతా కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాల కోసం కాదు. దీనికి కారణం బొద్దింకలు.

బొద్దింకలు ఆస్థాయిలో ఉంటాయా.. ఏకంగా ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయిలో ఇబ్బంది పెడతాయా.. అనే అనుమానాలు మీలో వ్యక్తం కావచ్చు. కానీ అవి మామూలు బొద్దింకలు కావు. అవి కాక్రోచ్ జనతా పార్టీ బొద్దింకలు. నీట్ పరీక్షలో అవకతవకలు జరగడం.. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో సీజేపీ ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్ చుక్ ఏకంగా నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఆయనను బలవంతంగా దీక్ష విరమింపజేశారు.

సోనం ప్రస్తుతం ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయినప్పటికీ ఆసుపత్రి నుంచే ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం చలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనాలని ఒక లేఖ కూడా రాశారు. ఆ తర్వాత వేలాది మందిగా విద్యార్థులు ఢిల్లీ నగరానికి వచ్చారు. వారిని అడ్డుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో పోలీసులు విద్యార్థులను చెదర గొట్టారు. బాష్ప వాయువును ప్రయోగించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హుటాహుటిన పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడే ధర్మేంద్ర ప్రధాన్ ను భేటీ అయ్యారు. మరోవైపు జేపీ నడ్డా విద్యార్థులతో మాట్లాడుతున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఆయన సోనం వాంగ్ చుక్ ను కలుస్తారని తెలుస్తోంది.

చలో పార్లమెంటు పిలుపును బిజెపి పెద్దలు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. పైగా కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ఇచ్చిన పిలుపుకు అంత మంది వస్తారని అంచనా వేయలేదు . కానీ విద్యార్థులు భారీగా రావడంతో ఢిల్లీలోని ప్రధాన వీధులు కిక్కిరిసిపోయాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు ముందుగానే భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ విద్యార్థులు ఢిల్లీలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ భారీగా తరలివచ్చిన విద్యార్థులు ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. విద్యార్థులు భారీగా రావడంతో కేంద్ర పెద్దలు దిగివచ్చినట్టు తెలుస్తోంది. అందువల్లే కేంద్ర హోంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత పరిస్థితి ఎలా...

Balakrishna Injury: వరుస సూపర్ హిట్స్ తో 6 పదుల వయస్సులో కూడా జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ , ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో...

Rajamouli Next Movie: రాజమౌళి నెక్స్ట్ సినిమా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోందా…

Rajamouli Next Movie: ప్రస్తుతం రాజమౌళి 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా చేయడం...

Telangana Employee Health Scheme: తెలంగాణ ఉద్యోగులు గుడ్‌ న్యూస్‌.. 40 ఏళ్లు దాటితే ఫ్రీ హెల్త్‌ చెకప్‌!

Telangana Employee Health Scheme: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారి సంక్షేమం కోసం ‘నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం’ (ఎన్‌ఈహెచ్‌ఎస్‌) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం...

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...
Oktelugu Epaper
Exit mobile version