దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలు లో శిక్ష అనుభవిస్తున్న ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కు కరోనా వైరస్ సోకిన విషయం విదితమే. అయితే రాజన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయనను జైలు నుంచి ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించినట్లు ముంబై సెషన్స్ కోర్టుకు సోమవారం అధికారులు తెలిపారు. చోటా రాజన్ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నాడని, జైలులోని ఆస్పత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నామని ఇటీవల అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే.