Sidiri Appalaraju: స్నేహం మంచి వాళ్ళతో చేయాలి. ప్రేమ అనురాగం నిండిన వారితో సాగించాలి. బంధం గొప్పవాళ్ళతో పెన వేసుకోవాలి.. ఇలా కాకుండా స్థాయి.. అర్హత లేని వారితో స్నేహం.. ప్రేమ.. బంధాన్ని కొనసాగిస్తే ఆ తదుపరి పరిణామాలు వేరే విధంగా ఉంటాయి.. ఇప్పుడు ఇవి శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ఎస్సైకి అనుభవంలోకి వచ్చాయి. కాకపోతే ఆయనకు అర్థం అయ్యేలోపే.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇటీవల శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ప్రాంతంలో ఒక ఘటన జరిగింది. ఈ ఘటనలో గొర్రెల కాపరి కన్నుమూశాడు. అయితే అతడిది సహజమరణం కాదు. దీని వెనక మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు సిదిరి అరవ్ వర్మ ఉన్నాడు. ఈ సంఘటన తీవ్రత తెలిసినప్పటికీ కాశిబుగ్గ ఎస్సై సునీల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ ఘటనకు కారకలైన వారి మాటలను మాత్రమే ఆయన ప్రామాణికంగా తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో దానయ్య అనే గొర్రెల కాపరి కన్నుమూసిన నేపథ్యంలో.. అతని భార్య ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించి బైక్ యజమాని సిద్ధార్థ ను నిందితుడిగా ఎస్ఐ పేర్కొన్నారు. సాంకేతిక ఆధారాలను విస్మరించారు.
సునీల్ విహరించిన తీరు పట్ల అభియోగాలు వచ్చాయి. పైగా ఆయన అప్పలరాజు కు అనుకూలంగా వ్యవహరించాలని టిడిపి నేతలు విమర్శించడం మొదలుపెట్టారు. విధులలో అతడు చూపిన అలసత్వాన్ని కారణంగా పేర్కొంటూ.. ఆయనను విఆర్ కు పంపిస్తూ ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కస్టమర్ కి ఈనెల 10న రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పుడు నైట్ రౌండ్స్ లో ఉన్న సునీల్ ఘటన స్థలంలో సిబ్బందితో కలిసి పరిశీలన జరిపారు.. అయితే ఇక్కడ సాంకేతిక ఆధారాలను ఆయన విస్మరించారు.
మరోవైపు అరవ్ వర్మ రెగ్యులర్, తాత్కాలిక బెయిల్ విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. రెగ్యులర్ బెయిల్ కావాలని.. తాత్కాలిక బెయిల్ కావాలని. ఇలా రెండు పిటిషన్ వేశారు. అయితే దీనిపై ఇప్పట్లోనే నిర్ణయం తీసుకోలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీనికి తోడు అప్పలరాజు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానిపై కూడా న్యాయమూర్తి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా,ఈ ఘటనలో తన కుమారుడిని తప్పించడానికి అప్పలరాజు అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. చివరికి అడ్డంగా దొరికిపోయారు.
