Homeజాతీయ వార్తలుayodhya donations scam : అయోధ్య విరాళాలు మాయం.. రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు

ayodhya donations scam : అయోధ్య విరాళాలు మాయం.. రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు

ayodhya donations scam : కోట్లాదిమంది హిందువుల విశ్వాసమైన రాముడికి అయోధ్యలో ఆలయ నిర్మాణంలో ఇచ్చిన విరాళాలు దారి మళ్లి పోయాయి. ఒకటి కాదు, రెండు కాదు కోట్ల సమ్మకు లెక్కలు లేకుండా పోయాయి. ఈ వ్యవహారం మొదట్లో చిన్నది అనుకున్నప్పటికీ.. తవ్వితీస్తుంటే భారీగా అక్రమాలు కనిపిస్తున్నాయి. తద్వారా ఇందులో ఒకరిద్దరు మాత్రమే కాదని.. చాలామందికి హస్తము ఉందని తెలుస్తోంది.

అయోధ్య విరాళాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడిన వారిలో అను కల్ప్ మిశ్రా కీలక సూత్రధారి అని తెలుస్తోంది. ఇతడి బామ్మర్ది లవకుశ కూడా భారీగా వెనకేసుకున్నట్టు సమాచారం. వీరిది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బసవ గ్రామం. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారణ చేసినప్పుడు దిగ్బ్రాంతి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుకల్ప్ భారీగా భవనాలను నిర్మించాడని.. విలాసవంతమైన వాహనాలను కొనుగోలు చేశాడని తెలుస్తోంది. పొలాలు.. స్థలాలు కొనుగోలు చేసినట్టు సమాచారం. అతడి బావమరిది లవకుశ కూడా భారీగా వెనకేసుకున్నట్టు తెలుస్తోంది.

అను కల్ప్ అక్రమ వ్యవహారాల గురించి అతని తాత రాజేంద్రప్రసాద్ పోలీసులు సమాచారం ఇచ్చాడు. గడచిన ఏప్రిల్ 30న అను కల్ప్ సొంత గ్రామంలో అత్యంత భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించాడు. దీనికి చంపత్ రాయ్ కూడా హాజరయ్యారు. తీర్ధ క్షేత్ర ట్రస్ట్ నుంచి కూడా భారీగా పెద్దలు హాజరయ్యారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడానికి అను కల్ప్ కు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి అని విషయం పట్ల సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అను కల్ప్ ఇటీవల అతి పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశాడు. గత ఏడాది ఏకంగా 65 లక్షలు వెచ్చించి అయోధ్యలో అత్యంత భారీ ఇంటి నిర్మించాడు. గతంలో ఇతడు ఒక బ్యాంకులో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగిగా పని చేసేవాడు. అతడు ఇంత సొమ్ము సంపాదించడానికి ప్రధాన కారణం అక్రమాలేనని తెలుస్తోంది. ఇతడి బామ్మర్ది లవకుశ మొదటిదాకా ఒక అద్దం ఇంట్లో ఉండేవాడు. ఇప్పుడు అతడు విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. అందులో ఖరీదైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు.

వచ్చిన విరాళాలను నమోదు చేయకపోవడం.. బ్యాంకులో జమ చేసే డబ్బులలో ఎక్కువ నోట్లు పెట్టి.. ఆ తర్వాత బ్యాంకు వద్దకు వెళ్లకముందే ఆ నోట్లను తీసుకొని.. వీరు తమ జేబులో వేసుకునేవారు. అలా భారీగా డబ్బులు దోచుకున్నారు. బంగారు నగలు.. ఇతర ఖరీదైన కానుకలు కూడా వీరు తస్కరించారు. ఫలితంగా రాముడికి చెందకుండా.. విలువైన కానుకలు మొత్తం వీరి జేబుల్లోకి వెళ్లాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version