కడప జిల్లాలో దారుణం

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం డి. నేలటూరులో దారుణం జరిగింది. తల్లి, కుమార్తె దారుణహత్యకు గురయ్యారు. అంజనమ్మ, లక్ష్మీదేవిని దుండగులు కత్తులతో నరికి చంపారు. పాతకక్షల నేపథ్యంలోనే తల్లి, కుమార్తెను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అంజనమ్మ కోడలు ఛరిష్మ 2019 లో హత్యకు గురయ్యారు. కోడలిని హతమార్చింది అంజనమ్మ  కుటుంబ సభ్యులేనన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె ఇంటి ఎదుటే ఛరిష్మ మృతదేహాన్ని పూడ్చిపెట్టి అక్కే సమాధి నిర్మించారు. దీనిపై అప్పట్లో అంజనమ్మ కుటుంబ సభ్యులపై కేసు […]

Written By: Suresh, Updated On : August 6, 2021 4:36 pm
Follow us on

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం డి. నేలటూరులో దారుణం జరిగింది. తల్లి, కుమార్తె దారుణహత్యకు గురయ్యారు. అంజనమ్మ, లక్ష్మీదేవిని దుండగులు కత్తులతో నరికి చంపారు. పాతకక్షల నేపథ్యంలోనే తల్లి, కుమార్తెను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అంజనమ్మ కోడలు ఛరిష్మ 2019 లో హత్యకు గురయ్యారు. కోడలిని హతమార్చింది అంజనమ్మ  కుటుంబ సభ్యులేనన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె ఇంటి ఎదుటే ఛరిష్మ మృతదేహాన్ని పూడ్చిపెట్టి అక్కే సమాధి నిర్మించారు. దీనిపై అప్పట్లో అంజనమ్మ కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలో అంజనమ్మ, ఆమె కుమార్తె హత్యకు గురయ్యారు.