తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నూతన ఛైర్మన్ గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా కొనసాగిన పాపిరెడ్డి పదవీ కాలం ముగియడంతో లింబ్రాదికి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం లింబాద్రి ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.