Andhra Pradesh development : 2014 లో ఆంధ్ర విడిపోయినప్పుడు గుర్తు చేసుకుంటే ఆంధ్రులకు నిద్ర పట్టదు. ఆదాయం లేదు.. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడదీసిన అవిభాజ్య ఏపీకి అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అంతటి విషాదంలో ఉన్న ప్రజలు.. కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపించిందన్న బాధ ఆంధ్రుల్లో నెలకొంది. 2014 తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటూ కాలయాపన.. రాజధాని లేకుండా సాగిన వైనంపై ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. 2019లో ఒక్క ఛాన్స్ అన్న జగన్ ను గెలిపించారు జనం. కానీ అభివృద్ధి లేకుండా సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్ ను జనం ఓడించారు.
పవన్ కళ్యాణ్ అటు టీడీపీని, బీజేపీని కలిపి ఆంధ్రాలో కూటమి కట్టి గెలుపునకు బాటలు వేశారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో ఈ కూటమి కీలక పాత్ర పోషించింది. పవన్ కీరోల్ గా ఈ కూటమి కట్టడంలో పాత్ర పోషించారు. ఈ పదేళ్లలో విభిజనతో పోగొట్టుకున్నటువంటి నిధులు, అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. విభిజనతో నష్టపోయిన ఏపీకి ఇప్పుడు నిధుల వరద పారుతోంది. అమరావతి నిర్మాణం, పోలవరం పట్టాలెక్కింది. విశాఖ స్టీల్ ప్లాంట్ తిరిగి పునరుద్దరించబడింది.
విభజనతో కుంగిపోయింది ఇప్పుడు అభివృద్ధిలో అంగలేస్తున్న ఏపీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

