ఒలింపిక్స్ లో మూడో రౌండ్ వరకూ చేరి ఆశ్చర్యపరిచిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా చిక్కుల్లో పడింది. మ్యాచ్ ల సందర్భంగా నేషనల్ కోచ్ సౌమ్యదీప్ రాయ్ ని మనికా బాత్రా నిరాకరించడంపై టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీవ్రంగా పరిగణిస్తోంది. అంతేకాదు అతన్ని సుతీర్థ ముఖర్జీ వ్యక్తిగత కోచ్ గా అభివర్ణించడాన్ని ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ అరుణ్ కుమార్ బెనర్జీ తప్పుబట్టారు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత దీనిపై చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు.