ఇండియన్ టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా ఒలింపిక్స్ సింగిల్స్ ఈవెంట్ లో మూడో రౌండ్ చేరుకుంది. రెండో రౌండ్ లో ఆమె పోరాడి గెలిచింది. 20వ సీడ్ ఉక్రెయిన్ ప్లేయర్ పెసోట్ స్కా పై 4-3 గేమ్స్ తేడాతో విజయం సాధించింది. తొలి రెండు గేమ్ లను కోల్పోయినా కూడా మనికా అద్భుతంగా పోరాడి 3, 4తో పాటు 6,7 గేమ్స్ లో గెలిచి మ్యాచ్ ను సొంతం చేసుకుంది. గంట పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో 4-11, 4-11, 11-7, 12-10, 8-11, 11-7, తేడాతో మనికా బాత్రా గెలిచింది.