Accident: తిరుమల ఘాట్ వద్ద ప్రమాదం.. ఒకరి మృతి

చిత్తూరు జిల్లా తిరుమల మొదటి కనుమదారిలో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. తిరుపతి చేరుకొనేందుకు మరో మూడు కి.మీల దూరంలో ఉండగా జరిగిన ఈ ప్రమాదంలో శివలింగం అనే వ్యక్తి మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కారు అదుపు తప్పి రైలింగ్ ని ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వారు మెదక్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.

Written By: Velishala Suresh, Updated On : September 11, 2021 3:48 pm
Follow us on

చిత్తూరు జిల్లా తిరుమల మొదటి కనుమదారిలో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. తిరుపతి చేరుకొనేందుకు మరో మూడు కి.మీల దూరంలో ఉండగా జరిగిన ఈ ప్రమాదంలో శివలింగం అనే వ్యక్తి మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కారు అదుపు తప్పి రైలింగ్ ని ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వారు మెదక్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.