
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 42,526 నమూనాలను పరీక్షించగా 2,242 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,53,277కి చేరింది. తాజాగా మరో 19 మంది మహమ్మారికి బలవ్వగా మొత్తం మృతుల సంఖ్య 3125 కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40,489 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. ఇవాళ 4,693 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు పేర్కొంది. మరోవైపు జీహెచ్ ఎంసీ పరిధిలో 343 మందికి పాజిటివ్ గా తేలింది.