Site icon OkTelugu

క్రొయేషియన్ ప్రధాన మంత్రికి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులపై పంజా విసురుతోంది. తాజాగా క్రొయేషియన్ ప్రధాన మంత్రి ఆండ్రేజ్ ప్లెన్ కోవిక్ కరోనా బారిన పడ్డారు. ఆయన సతీమణి కూడా పాజిటివ్ నిర్దారణ అయింది. వైద్యుల సూచనల మేరకు ఆయన హోం క్వారంటైన్ కు వెళ్లారు. పరిపాలన కార్యక్రమాలు అన్ని ఇంటి నుంచే నిర్వహించున్నారు. కాగా గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబ సభ్యులకు, బ్రిటన్ ప్రధాన మంత్రికి కూడా పాజిటివ్ నిర్దారణ అయి కోలుకున్నారు. దీంతో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదనే తెలుస్తోంది.

Exit mobile version